కాంగ్రెస్‎ను టచ్ చేస్తే మేమేంటో చూపిస్తాం..: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Telangana Minister Komatireddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

తమ ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందని పేర్కొన్నారు.

రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ( Nitin Gadkari ) హామీ ఇచ్చారని తెలిపారు.రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు.

కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు తీసుకురాలేని అసమర్థుడు అని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి( Kishan Reddy ) కాంగ్రెస్‎ను టచ్ చేస్తే తామేంటో చూపిస్తామని తెలిపారు.

త్వరలోనే ప్రధాని మోదీ( PM Modi )ని సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారని వెల్లడించారు.అలాగే కేఆర్ఎంబీ అంటే బీఆర్ఎస్ వాళ్లకు తెలియదన్న ఆయన నీళ్ల విషయంలో నల్గొండను మోసం చేసినందుకు పదకొండు చోట్ల బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించారని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవదని తెలిపారు.

Advertisement
యూఎస్ లో ప్రీ సేల్స్ విషయంలో దేవర అరాచకం.. ఈ రికార్డ్స్ ఎవరికీ సాధ్యం కాదంటూ?

తాజా వార్తలు