జనసేనానికి మంత్రి జోగి రమేశ్ కౌంటర్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు మంత్రి జోగి రమేశ్ కౌంటర్ ఇచ్చారు.బీసీల గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్ కు లేదన్నారు.

ఈ క్రమంలో బీసీలకు పవన్ క్షమాపణలు చెప్పాలని తెలిపారు.పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత పవన్ కు బీసీలు గుర్తుకు వచ్చారని విమర్శించారు.

అనంతరం పవన్ కల్యాణ్ కు మంత్రి జోగి రమేశ్ సవాల్ విసిరారు.సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.2014లో చంద్రబాబుతో బీసీలకు ఇచ్చిన 125 హామీలలో ఒక్కటి కూడా కూడా అమలు చేయలేదని తెలిపారు.బీసీలు తలెత్తుకునేలా బీసీల తలరాతను మార్చింది సీఎం జగన్ అని స్పష్టం చేశారు.

కడపను టార్గెట్ చేసిన టీడీపీ .. అలెర్ట్ అవుతున్న జగన్
Advertisement

తాజా వార్తలు