మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఏ పరిశ్రమనూ రాజకీయ కోణంలో చూడలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి అన్నారు.పరిశ్రమలు వస్తే ఉపాధి లభిస్తుంది.

రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుందన్నారు.పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరిలిపోతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అమర్ రాజా ప్రతినిధులు ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నించారు.

ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లా అని ప్రశ్నించారు.చంద్రబాబుకు చెందిన హెరిటెజ్ వ్యాపారం ఏపీలోనే ఉందన్న ఆయన చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందా అని అడిగారు.

Advertisement

ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు