చంద్రబాబుపై మంత్రి ధర్మాన మండిపాటు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు హయాంలో బ్రోకర్ల వ్యవస్థ ఉండేదని చెప్పారు.

నన్ను గెలిపించిన ప్రజలు తలదించుకునేలా తాను ఎప్పుడూ పని చేయనని తెలిపారు.అవినీతి అంటే నచ్చదన్న ఆయన ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు.

పార్టీ నేతలు కూడా ఆర్థికంగా దెబ్బతిని ఉన్నా అవినీతి చేయడం లేదని వెల్లడించారు.మూడున్నర ఏళ్లలో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించాలని తెలిపారు.

ప్రజల పన్ను డబ్బులు పేదలకు సంక్షేమం రూపంలో అందిస్తున్నామన్నారు.చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉండి ఏపీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

Advertisement

చంద్రబాబుకు కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడిదని ప్రశ్నించారు.

ఏంటి హార్దిక్ అంత సింపుల్ గా ఆడేసావ్.. 'నో లుక్ షాట్' వైరల్
Advertisement

తాజా వార్తలు