కమల్ హాసన్ పార్టీకి ఆదిలోనే హంసపాదు

త్వరలో తమిళనాడు లో అసెంబ్లి ఎలక్షన్స్ జరగబోతున్నాయి.అక్కడ ఉన్న ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఇప్పటికే తమ ప్రచారాన్ని ఉదృతం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే "మక్కల్ నీది మయ్యమ్" పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా తన పార్టీ కార్యాచరణలో బిజీగా ఉన్నాడు.అయితే ఆ పార్టీ ప్రదాన కార్యదర్శి గా కొనసాగుతున్న అరుణాచలం పార్టీ మారాడు.

కేంద్ర మంత్రి జవధేకర్ సమక్షంలో చెన్నైలోని బి‌జే‌పి కార్యలయం నందు ఆయన కషాయం కండువా కప్పుకున్నాడు.

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తుండటంతో బి‌జే‌పి దూకుడు పెంచింది.ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటు తమ పార్టీ బలాన్ని పెంచుకుంటూ పోతుంది.మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవహారాల పట్ల గత కొద్ది రోజులుగా అరుణాచలం అసంతృప్తితో ఉన్నట్లుగా చెప్పాడు.

Advertisement

అందుకే పార్టీ మారాను అన్నాడు.ఇక విషయంపై ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ నుండి ఎటువంటి స్పందన లేదు.

అరుణాచలం బి‌జే‌పిలో చేరడంతో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు