SSMB28 : మహేష్ సిద్ధం.. సెకండ్ షెడ్యూల్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసాడు.దీంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

సర్కారు వారి పాట సినిమా ఇటీవలే ఘన విజయం సాధించింది.వరుస సూపర్ హిట్స్ అందుకుంటున్న సూపర్ స్టార్ ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతలో వేసుకోవడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇదే సంతోషంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇటీవలే రెగ్యురల్ షూట్ స్టార్ట్ చేసారు.సెప్టెంబర్ 12న ఈ సినిమా హైదరాబాద్ లో స్టార్ట్ అవ్వగా విరామం లేకుండా షూటింగ్ జరిగింది.

ఫస్ట్ షెడ్యూల్ లోనే యాక్షన్ సన్నివేశాలతో త్రివిక్రమ్ ఈ సినిమాను స్టార్ట్ చేసాడు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగాడు.

Advertisement

రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంది.ఒక యాక్షన్ సీక్వెన్స్ ను ఇప్పటికే పూర్తి చేసారు.

సెకండ్ షెడ్యూల్ రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయాలని అనుకున్నాడు.కానీ ఈ లోపే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారు మరణించారు.

దీంతో ఘట్టమనేని ఇంట్లో మరోసారి విషాదం చోటు చేసుకుంది.మహేష్ బాబుకు తల్లితో చాలా అటాచ్ మెంట్ ఉంది.

మరి అలాంటి తల్లి ఇక లేరు అని తెలిసి ఈయన చాలా క్రుంగి పోయారు.దీంతో ఈయన చాలా రోజులు గ్యాప్ తీసుకున్నారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

దీంతో షెడ్యూల్ లో మార్పులు చేసి మరో డేట్ ఫిక్స్ చేసారు.తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

Advertisement

అక్టోబర్ 10 నుండి ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారట.ఈ షెడ్యూల్ లో ఫ్యామిలీ సన్నివేశాలతో పాటు మరికొన్ని సీరియస్ వార్ణింగ్ సన్నివేశాలను కూడా పూర్తి చేయబోతున్నారట.ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.

హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

తాజా వార్తలు