వికారాబాద్ జిల్లాలో చిరుత పులి సంచారం

వికారాబాద్ జిల్లాలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.పరిగి మండలం జైదుపల్లిలో చిరుత కనిపించిందని తెలుస్తోంది.

తాజాగా జైదుపల్లి రోడ్డులో ఓ వాహనదారుడికి చిరుత పులి అడ్డువచ్చింది.అయితే చిరుత సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పదిహేను రోజుల కిందట పుడూరు మండలంలోని దామకుండం అటవీ ప్రాంతంలో ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది.తాజాగా మూడు రోజుల కిందట పుడూరు ఎంకేపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు గుర్తించారు.

అలాగే చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop

తాజా వార్తలు