21న టెండర్ పెట్టిన రాఖీ భాయ్

సౌత్ ఇండియాలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ యాక్షన్ మూవీ ‘కేజీఎఫ్ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం.

కాగా ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే ట్రీట్‌ను అందించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.డిసెంబర్ 21న ఉదయం 10.08 నిమిషాలకు ఈ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.అయితే ఈ ట్రీట్ ఏమిటనేది మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు.

ఈ సినిమాలోని హీరో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుందా లేక ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.ఏదేమైనా డిసెంబర్ 21న ఉదయం కేజీఎఫ్ చాప్టర్ 2 నుండి రాబోతున్న ఆ ట్రీట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది.

Advertisement

ఇక ఈ సినిమాలో రాకీ భాయ్‌గా యశ్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టండన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.మరి ఈ సినిమా నుండి రాబోతున్న ట్రీట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఎంతవరకు రెట్టింపు చేస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు