విశాఖ ఉక్కుపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

విశాఖ ఉక్కుపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.విశాఖ ఉక్కుపై కేసీఆర్, కేటీఆర్ మాటలకే కేంద్రం దిగి వచ్చిందని చెప్పారు.

తమ పోరాటం వలనే కేంద్రం మంకుపట్టు వీడిందని తెలిపారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మటం లేదని కేంద్రం ప్రకటించిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

ఇది కేవలం బీఆర్ఎస్, కేసీఆర్ తో పాటు ప్రజల విజయమని కొనియాడారు.గులాబీ జెండా ఏపీ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఏపీలో ఉన్న రెండు పార్టీలు నోరు మూసుకున్నా బీఆర్ఎస్, స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాడారని తెలిపారు.ఈ నేపథ్యంలో కేంద్రం మీద తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు.

Advertisement
రుద్రవీణ సినిమా కారణంగా నేను హోం శాఖ తీసుకోలేదు : పవన్ కళ్యాణ్

తాజా వార్తలు