పార్టీ నేతల సమావేశంలో లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు అరెస్ట్ అయిన నాటినుండి లోకేష్ రాజమండ్రిలోనే ఉంటూ అన్ని విషయాలు సమీక్షిస్తూ ఉన్నారు.

ఒకపక్క న్యాయపోరాటం చేస్తూనే మరోపక్క చంద్రబాబు అక్రమ అరెస్టుకు గాను రాష్ట్రవ్యాప్తంగా పలు నిరసనలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు "బాబుతో నేను" పేరుతో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం పార్టీ నేతలతో లోకేష్ ( Lokesh )సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.

చంద్రబాబు అరెస్టుతో జగన్ తాత్కాలిక ఆనందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు.అరెస్ట్ తర్వాత చేపట్టిన నిరసనలు, భవిష్యత్తు కార్యాచరణ, అరెస్ట్ అక్రమం అని ప్రజలలోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై నేతలతో చర్చించడం జరిగింది.

Advertisement

చంద్రబాబు అరెస్టు పట్ల అన్ని వర్గాల ప్రజలలో అసంతృప్తి, ఆవేదన నెలకొందని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే రాజమండ్రిలో ఉన్న నారా లోకేష్ ని జనసేన పార్టీకి చెందిన నేతలు కలిసి సంఘీభావం తెలియజేశారు.

లోకేష్ ని కలిసిన వారిలో జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్( Bodapati Shivdutt ), చోడవరం ఇంచార్జి పిఎస్ఎన్ రాజు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా తన పండగ నిలబడటానికి వచ్చిన జనసేన నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

వైసీపీనీ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి అంతా కలిసి పోరాడదాం అని జనసేన నేతలకు లోకేష్ సూచించారు.

నయనతార పిల్లల లేటెస్ట్ ఫోటోలను మీరు చూశారా.. చాలా క్యూట్ గా ఉన్నారంటూ?
Advertisement

తాజా వార్తలు