వైరల్: NTR డైలాగ్ చెప్పిన ఆనంద్‌ మహీంద్రా... వైరల్ అవుతున్న వీడియో!

ఏంటి? NTR డైలాగ్ ఆనంద్‌ మహీంద్రా చెప్పడమేంటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.భారత టెక్ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా పరిచయం అక్కర్లేదేమో.

ఆయన తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత బిజీగా వుంటారో సోషల్ మీడియాలో కూడా అంతే బిజీగా వుంటారు ఈ బిజినెస్ మ్యాన్.ముఖ్యంగా కొత్త కొత్త ఐడియాలు ఎవరు చేసినా వారిని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు ఆనంద్‌ మహీంద్రా.

అలాగే ఎక్కడ పొరపాట్లు జరిగినా నిర్భయంగా వేలెత్తి ప్రశ్నిస్తారు ఈ దిగ్గజం.తాజాగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఓ అరాచకం గురించి తనదైన రీతిలో ఆనంద్‌ మహీంద్రా ఓ పోస్టు పెట్టారు.

పర్యావరణ సమతుల్యానికి కారణమైన చెట్లను ప్రజలు విపరీతంగా నరికివేస్తున్నారు.అందువలన నానాటికీ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందనే విషయం అందరికీ తెలిసినదే.

Advertisement

ఈ నేపథ్యంలో ఆనంద్‌ మహీంద్రా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.సదరు వీడియోలో నలుగురు ఓ భారీ పొడవైన చెట్టు నరికేస్తారు.

అందులో ఓ వ్యక్తి నరికిన ఆ చెట్టును కింద పడేసే ప్రయత్నం చేయగా.అది కాస్తా ఒరిగి చెట్టును నరికిన వ్యక్తిని పైకి ఎత్తి అవతల పడేస‍్తుంది.

దానిని ఆనంద్‌ మహీంద్రా ఉటంకిస్తూ.మీరు చెట్టును నరికేయగలరు.కానీ దానిని కింద పడేయలేరు! అంటూ ఓ క్యాప్షన్‌ను జత చేస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను విపతీరంగా ఆకట్టుకుటుంది.ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!

మరికొందరు ఈ వీడియోని రీట్వీట్‌ చేస్తున్నారు.ప్రకృతికి కోపం వస్తే ఇలాగే ఉంటుందంటూ చిన్నాభిన్నమైన రోడ్ల వీడియోల్ని షేర్లు చేస్తున్నారు.

Advertisement

అలాగే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ అయితే ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ సినిమాలోని డైలాగులు షేర్ చేస్తున్నారు.

తాజా వార్తలు