స్టార్ హీరోయిన్ నయనతారకు పెళ్లైందా.. పెళ్లైన స్త్రీలు చేసినట్టు చేయడంతో?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో వరుసగా సినిమా ఆఫర్లను అందుకోవడంతో పాటు సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా నయనతార సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

విఘ్నేష్ శివన్ తో నయనతార ప్రేమలో ఉండగా కొన్ని నెలల క్రితం వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా జరిగిందనే సంగతి తెలిసిందే.

అయితే నయనతార విఘ్నేష్ శివన్ లకు పెళ్లైందని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.గతంలోనే ఈ తరహా ప్రచారం జరగగా ప్రస్తుతం ఇలాంటి ప్రచారం జరగడం వెనుక ముఖ్యమైన కారణం ఉంది.

గడిచిన ఐదు సంవత్సరాలుగా నయనతార విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారు.సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటామని నయన్ విఘ్నేష్ జోడీ చెబుతుండగా తాజాగా నయనతార పాపిట కుంకుమతో కనిపించారు.

సాధారణంగా పెళ్లైన స్త్రీలు మాత్రమే పాపిట కుంకుమను పెట్టుకోవడం జరుగుతుంది.

Advertisement

అయితే నయనతార తాజాగా పాపిట కుంకుమను పెట్టుకుని కనిపించడంతో ఆమెకు పెళ్లైందని ప్రేక్షకులు భావిస్తున్నారు.తమిళనాడులోని ప్రముఖ ఆలయాన్ని తాజాగా నయనతార విఘ్నేష్ శివన్ దర్శించుకున్నారు.వైరల్ అవుతున్న వార్తల గురించి నయనతార, విఘ్నేష్ శివన్ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

నయనతార నటించిన కాతువాక్కుల రెండు కాదల్ సినిమా ఏప్రిల్ నెలలో థియేటర్లలో విడుదల కానుంది.

విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సమంత ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించారు.విజయ్ సేతుపతి ఈ సినిమాలో హీరోగా నటించడం గమనార్హం.నయనతార తన పెళ్లికి సంబంధించి త్వరగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

కణ్మణి రాంబో ఖతీజా పేరుతో తెలుగులో ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.సమంత పుట్టినరోజు కానుకగా తెలుగులో రిలీజవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు