రొటీన్ కథను కొత్తగా తెస్తున్న నాని

నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయగా దానికి మిక్సిడ్ టాక్ లభించింది.

కాగా ఈ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా నాని తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు.

ఇప్పటికే ‘టక్ జగదీశ్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తున్న నాని, మరో సినిమా ‘శ్యామ్ సింఘ రాయ్’ను కూడా క్యూలో పెడుతున్నాడు.కాగా ‘టాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్, ఇప్పుడు ‘శ్యామ్ సింఘ రాయ్’ చిత్రంలో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు నాని సిద్ధమవుతున్నాడు.కాగా ఈ సినిమా కథ కోల్‌కతా నేపథ్యంలో సాగుతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమ కథలో కోల్‌కతాలో ఉండే వ్యక్తి మృతి చెందిన తరువాత మళ్లీ జన్మించి తన పనులు పూర్తి చేస్తాడనేది చిత్ర కథాంశంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికే ఇలాంటి కథలు బోలెడన్నీ వచ్చినా, కథనంలో కొత్తదనం ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.మరి ఇలాంటి రొటీన్ కథతో రాబోతున్న నాని ఎలాంటి అంశాలను కొత్తగా చూపించబోతున్నాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాలో నాని సరసన అందాల భామ సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లో వేసిన కోల్‌కతా సెట్‌లో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాతో నాని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

సురేష్ ప్రొడక్షన్ మూవీలను రిలీజ్‌కి ఒక రోజు ముందే థియేటర్లలో వేస్తారట..??
Advertisement

తాజా వార్తలు