ప్రభుత్వ ఉచిత పథకాలపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు...!!

భారతదేశంలో రాజకీయం ఎక్కువగా ఉచిత పథకాలు( Free Schemes ) చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.

ప్రజలు కూడా ఏ పార్టీ ఎక్కువ ఉచిత పథకాలు ప్రకటిస్తే.

పార్టీకి ఎక్కువ అధికారం కట్ట బెట్టిన దాఖలాలు చాలానే ఉన్నాయి.దీంతో చాలా రాజకీయ పార్టీలు ప్రజలను సోమరిపోతులు చేస్తున్నట్లు విమర్శలు వస్తూనే ఉన్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి( Infosys Founder Narayanamurthy ) అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు.పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితాలను ప్రజలు వినియోగించుకుంటున్నారు.

అయితే నేను ఉచితలకు వ్యతిరేకం కాదు.సమాజంలో పేదల పరిస్థితిని అర్థం చేసుకోగలను.ఈ క్రమంలో రాయితీ పొందిన వారు తిరిగి సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి.

Advertisement

ఉచిత విద్యుత్( Free Electricity ) అందిస్తే దానికి బదులుగా బిడ్డలను బడికి పంపించి చదివించాలని స్పష్టం చేశారు.మొన్ననే దేశం అభివృద్ధి చెందాలంటే యువత వారానికి కనీసం 70 గంటల పని చేయాలని నారాయణ మూర్తి వ్యాఖ్యలు చేశారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కాంట్రవర్సీగా మారాయి.ఆ రకంగా 70 గంటలు పని చేస్తే ప్రపంచంతో భారత్( India ) పోటీ పడుతుందని యువత మూడు షిఫ్టులు పనిచేస్తే చైనాను అధిగమించగలమని పేర్కొనడం జరిగింది.

ఈ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వాల అందించే పథకాలపై.నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కొండగట్టు ఆలయంలో జై కేసీఆర్ నినాదాలు చేసిన స్వాములు
Advertisement

తాజా వార్తలు