అగ్నిప్రమాదాలకు నిలయంగా హైదరాబాద్..: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని రేవంత్ రెడ్డి తెలిపారు.హైదరాబాద్ అగ్నిప్రమాదాలకు నిలయంగా మారిందన్న ఆయన వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

నివారణ చర్యలు చేపట్టడంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని ధ్వజమెత్తారు.కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బాధితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మరోవైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

తాజా వార్తలు