టార్గెట్ టాలీవుడ్.. బాలీవుడ్ హీరోల దండయాత్ర

ఎప్పుడు మీరు మాత్రమే మా బాక్స్ ఆఫీస్ పై దాడి చేస్తారా ఇక మేము కూడా మీ ఇండస్ట్రీ ని తెగ వాడేస్తాం అంటూ టాలీవుడ్( Tollywood ) పైకి దూసుకస్తున్నారు.

ఆలా ఒకరో ఇద్దరో వస్తే పర్వాలేదు కానీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలు తమ తమ సినిమాలను తెలుగు లో కూడా రిలీజ్ చేస్తుండటమే ఈ మధ్య బాగా పెరిగింది.

ఇటీవల కాలంలో అయితే మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లో కూడా విడుదల అవుతున్నాయి కాబట్టి తెలుగు సినిమాల కథలను రీమేక్ చేయకుండా తమిళ మరియు మలయాళ సినిమాల పై బాలీవుడ్ ఫోకస్ పెరిగింది.కానీ తీసిన సినిమాలను మాత్రం తెలుగు ప్రేక్షకులకు చూపించి విడుదల చేసుకోవడం మాత్రం బాగానే చేస్తున్నారు.

కొన్నేళ్ళకు ముందు కేవలం సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి హీరోల సినిమాలు మాత్రమే వచ్చేవి.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.తెలుగు అభిమానులను ప్రసన్నం చేసుకోవడానికి తెగ కష్టపడి పోతు హైదరాబాద్ కి వచ్చి మరి ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ ఇండియా కు సినిమా క్యాపిటల్ గా మారిపోతుంది.ఎవరు సినిమా విడుదల చేయాలన్న హైదరాబాద్ కి చేరిపోతున్నారు.ఇక ఈ మధ్య టైగర్ ష్రాఫ్ సైతం తన గణపత్ సినిమా ను తెలుగు లో కూడా విడుదల చేస్తున్నాడు.

Advertisement

ఈ చిత్ర టీజర్ చిరంజీవి చేత విడుదల చేయించారు.ఇక సల్మాన్ ఖాన్ ఈ దివాళీ కి టైగర్ 3( Tiger 3 ) తో వస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 కూడా తెలుగు లో డబ్బింగ్ చేసి వదలడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరో వైపు తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తీసిన హిందీ మూవీ ఆనిమల్( Animal ) కూడా తెలుగు లో విడుదల అవుతుంది.మొత్తానికి ఇలా సౌత్ పై నార్త్ వారి ఫోకస్ పెరిగిపోయింది.

పైగా ఫ్యాన్ ఇండియా మూవీ అంటే ఒక్కో బాషా నుంచి ఒక్కో స్టార్ ని పెట్టి తీయడం ఈ మధ్య బాగా పెరిగింది కాబట్టి ఆనిమల్ లో హిట్ అవ్వాలంటే రష్మిక మందన్న, వార్ 2 హిట్ అవ్వాలంటే తారక్ ఉండనే ఉన్నారు.

అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు