రకుల్ నుంచి రష్మిక వరకు తెలుగు సినిమాపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న హీరోయిన్స్

ఓడలో ఉన్నంతవరకు ఓడ మల్లన్న, ఒడలోంచి దిగిన తర్వాత బోడ మల్లన్న ఇదే మన తెలుగు సినిమా హీరోయిన్ల తీరు.

తెలుగు సినిమాల్లో అవకాశాలు ఉన్నంతవరకు కిమ్మనకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా క్రేజ్ వచ్చిన తర్వాత బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసారు చాలామంది హీరోయిన్స్.

ఒక్కసారి బాలీవుడ్ లో అవకాశాలు వస్తాయో లేదో అప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీపై నోరు పారేసుకోవడం అలవాటు చేసుకుంటారు సదరు హీరోయిన్లు.తెలుగు సినిమా పరిశ్రమతో పాటు సౌత్ ఇండియా పరిశ్రమను చిన్నచూపు చూస్తారు.

బాలీవుడ్లో వారికి పరమావధిగా కనిపించే ఆ అవకాశాలు ఉన్నా లేకపోయినా వారికి తెలుగు భాష అప్పుడు పెద్దగా నచ్చదు.ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉన్న హీరోయిన్ ఇలియానా.

దేవదాసు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది దర్శకులు అంతా కూడా తన నడుం పైన వల్గర్ గా కామెంట్స్ చేసేవారు అంటూ చెప్పేది ఇలియానా.నీ నడుం పైన ఏదో ఉందంటూ, ముట్టుకోవాలనిపిస్తుందంటూ అందంగా ఉందంటూ, ఎల్లప్పుడూ కామెంట్స్ చేసే వేధించేవారు అని చెప్పింది.

Advertisement

ఇక నిన్నటికి నిన్న రష్మిక సైతం సౌత్ ఇండియా గురించి పిచ్చిగా కామెంట్స్ చేసి గురైన సంగతి మన అందరికీ తెలిసిందే.నిన్నటి వరకు ఆమె టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ ప్రస్తుతం బాలీవుడ్ లో మహా క్రేజ్ ఉందా కి దాంతో చిన్న చూపు చూస్తోంది సౌత్ ఇండియా పరిశ్రమని.

అవకాశాల కోసం నాన్న కష్టాలు పడుతున్న రాశి కన్నా సైతం సౌత్ దర్శకులు కేవలం బొద్దుగా ఉన్న హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేస్తారంటూ కామెంట్ చేసింది అలాగే ఒక వర్గం హీరోయిన్స్ కి అసలు అవకాశాలు ఇవ్వట్లేదు అంటుంది ఈ అమ్మడు.ఇక పూర్తిగా తెలుగులో కనుమరుగైన రకుల్ ప్రీత్ సైతం తెలుగు సినిమా దర్శకుల పై నోరు పారేసుకుంటుంది.పాన్ ఇండియా సినిమాల్లో ఒక వర్గం హీరోయిన్స్ నీ ఎంచుకోవడం లేదంటూ వ్యాఖ్యలు చేసింది.

వీరు మాత్రమే కాదు టాలీవుడ్ నుంచి లేదా సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ కి వెళ్లిన చాలా మంది హీరోయిన్స్ ఇలాగే సౌత్పై నోరు బారేసుకుంటూన్నారు.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు