ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి ఢిల్లీ హైకోర్టు( Delhi High Court ) వాయిదా వేసింది.

విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.ఈ క్రమంలోనే లిక్కర్ స్కాం కేసులో( Liquor Scam Case ) కవిత పాత్ర లేదని ఆయన కోర్టుకు తెలిపారు.

అదేవిధంగా లిక్కర్ కేసు దర్యాప్తునకు గతంలో కవిత సహకరించారని న్యాయవాది విక్రమ్ చౌదరి పేర్కొన్నారు.ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గును కేవలం 2 రోజుల్లో తరిమికొట్టే పవర్ ఫుల్ డ్రింక్ మీ కోసం!
Advertisement

తాజా వార్తలు