చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు సీఐడీ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు.

కౌంటర్ లో సవరణలు చేసి మళ్లీ పిటిషన్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు జడ్జి సూచించారు.ఈ క్రమంలోనే చంద్రబాబు కస్టడీ విచారణ నివేదికను సీఐడీ న్యాయస్థానానికి సమర్పించింది.

ఈ మేరకు నివేదికను సీల్డ్ కవర్ లో సీఐడీ అధికారులు సమర్పించారు.మరోవైపు చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు విచారణను వాయిదా వేసింది.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు