గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ఖమ్మంలో డబ్బు పంపిణీ కలకలం..!!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్( Graduate MLC Election Polling ) జరుగుతున్న సమయంలో డబ్బుల పంపిణీ తీవ్ర కలకలం సృష్టించింది.

ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని( Khammam District ) సాయిగణేశ్ నగర్ లో ఈ డబ్బు పంపిణీ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

సాయిగణేశ్ నగర్ లోని రాజకీయ నేత క్యాంపు కార్యాలయంలో డబ్బులు పంచుతున్నారనే వార్తలు రావడంతో జనం క్యూ కట్టారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతకు( Congress Leader ) సంబంధించిన ఆఫీస్ లో ఓటుకు రూ.500 పంచుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.కాగా వరంగల్ - ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు