నిరుదోగులకు శుభవార్త 10 న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్

ఎన్నికల పుణ్యమా అంటూ ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది.

చాలా కాలంగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది.

రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ షెడ్యూల్‌ని ప్రకటించింది.మొత్తం 9,270 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.ఈ నెల 10న డీఎస్సీ నోటిఫికేషన్‌ని విడుదల చేస్తాము.

నవంబర్‌ 30న పరీక్ష నిర్వహించి.వచ్చే ఏడాది జనవరి 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

ఈ రోజు జరిగే కేబినేట్‌ మీటింగ్‌లో పీఈటీ పోస్టుల పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించి తుది ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు