సీఐడీ నోటీసులపై ఏపీ హైకోర్టుకు మాజీమంత్రి నారాయణ..!

రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అనైల్ మెంట్ వ్యవహారంలో విచారణకు రావాలంటూ మాజీమంత్రి నారాయణకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు అందించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నోటీసులను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు.

పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.నారాయణను విచారించడానికి అనుమతిని ఇచ్చింది.

ఈ క్రమంలోనే సీఐడీ అధికారులకు పలు షరతులు విధించింది.ఇటీవలే నారాయణకు శస్త్ర చికిత్స అయిన నేపథ్యంలో గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి రావడం ఇబ్బందిగా ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఇందులో భాగంగా నారాయణను సీఐడీ కార్యాలయంలో కాకుండా ఇంటి వద్దనే విచారించాలని ఆదేశాలు ఇచ్చింది.

Advertisement
డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? అయితే ఈ నూనె వాడాల్సిందే!

తాజా వార్తలు