సిమ్లాలో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. తప్పిన ప్రాణాపాయం.!

హిమచల్ ప్రదేశ్ లో ని సిమ్లాలో( Shimla ) కొండచరియలు విరిగిపడ్డాయి.దీంతో ఐదంతస్థుల భవనం( Five-Storey Building ) ఒక్కసారిగా కుప్ప కూలింది.

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

కాగా ఈ భవనానికి సమీపంలో ఉన్న లా కాలేజీ బిల్డింగ్ లో కొంత భాగం ధ్వంసం కాగా చుట్టుపక్కల పగుళ్లు ఏర్పడ్డాయి.అయితే కొండ చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో ముందే అప్రమత్తమైన అధికారులు భవనంలోని వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు.దీంతో ప్రాణాపాయం తప్పింది.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement