సూర్యాపేట జనగాం రోడ్డుపై రైతుల ధర్నా

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జనగాం( Janagam ) రోడ్ లోని బాలెంల ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గతవారం,పది రోజులుగా వడ్లు కొనుగోలు జరపడం లేదని,గత కొద్దిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకలు ఎత్తుతున్నాయని రైతులు( Farmers ) ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం సూర్యాపేట జనగామ రహదారిపై ధర్నాకు దిగడంతో రాకపోకలు స్తంభించాయి.

ఈ సందర్భంగా రైతులు మాట్లడుతూ ఆర్డీవో, ఎంఆర్ఓ( RDO, MRO ) ఇతర అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప,ధాన్యం కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రాహ వ్యక్తం చేశారు.

సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి వెంటనే ధాన్యం కొనుగోలు జరిపే వరకూ రోడ్డుపై నుండి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దూరవిద్య ద్వారా ఉన్నత విద్యా లక్ష్యాలను చేరుకోవడం సులభం

Latest Suryapet News