Rameswaram Cafe : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‎లో పేలుడు..!!

బెంగళూరులో ( Bangalore ) పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

రాజాజీనగర్ లోని రామేశ్వరం కేఫ్‎లో( Rameswaram Cafe ) లో బ్లాస్ట్ జరిగింది.

ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.ఒక్కసారిగా కేఫ్ లో బ్లాస్ట్ జరగడంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.అలాగే సంఘటనా స్థలంలో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును పోలీసులు గుర్తించారు.

ఘటనలో ఏదైనా కుట్ర కోణం ఉందా? లేక ప్రమాదవశాత్తు పేలుడు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?

తాజా వార్తలు