రేపు తెలంగాణ స్పీకర్ ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక రేపు జరగనుంది.ఈ స్పీకర్ ఎన్నికకు ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే స్పీకర్ అభ్యర్థిగా ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎంపిక చేసింది.ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది.

ఇందులో భాగంగా ప్రతిపక్షాలతో చర్చలు నిర్వహించే బాధ్యతను పార్టీ నేత శ్రీధర్ బాబుకు అప్పగించింది.కాగా సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేస్తారు.

స్పీకర్ ఎన్నికకు ఒకే నామినేషన్ దాఖలైతే ఏకగ్రీవ ఎన్నికగా ప్రకటిస్తారు.ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలైన పక్షంలో ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తారని తెలుస్తోంది.

Advertisement
మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 

తాజా వార్తలు