నకిలీ ఓటరు కార్డులపై ఈసీ సీరియస్ ! విచారణ

నకిలీ ఓటరు ఐడీ కార్డులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ పేరుతో హైదరాబాద్‌ మెహదీపట్నంలో ఫేక్‌ ఓటరు‌ కార్డు పుట్టుకొచ్చింది.

మాజీ సీఈసీ ఓపీ రావత్‌ పేరుతో మరో ఓటరు కార్డు జారీ అయ్యింది.ఇద్దరు అధికారుల పేర్లతో ఓటరు కార్డులను జీహెచ్‌ఎంసీ అధికారులు జారీ చేశారు.

దీంతో.నకిలీ కార్డులపై సీఈసీ విచారణ చేపట్టింది.

అటు హైదరాబాద్‌ సీసీఎస్‌లో జీహెచ్‌ఎంసీ ఫిర్యాదుతో కార్డులు జారీ చేసిన అధికారులపై విచారణ జరుగుతోంది.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement