బైజూస్ ఆన్‎లైన్ సంస్థపై ఈడీ దాడులు

బైజూస్ ఆన్‎లైన్ సంస్థపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తుంది.

ఈ క్రమంలో సంస్థ సీఈఓ రవీంద్రన్ బైజూస్ కు చెందిన ఇళ్లు, కార్యాలయాలలో ఈడీ సోదాలు చేపట్టింది.

ఇందులో భాగంగా బెంగళూరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు ఈడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.తనిఖీలలో భాగంగా విలువైన పత్రాలతో పాటు డిజిటల్ డేటా జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది.

మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ విదేశీ మారక ద్రవ్యం వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని రవీంద్రన్ బైజూస్ పై కేసు నమోదు చేసింది.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!
Advertisement