'ప్రాజెక్ట్ కే' గ్లింప్స్ చూసిన దుల్కర్.. రియాక్షన్ కు డార్లింగ్ ఫ్యాన్స్ ఎగ్జైట్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.

ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ప్రస్తుతం ఈయన చేతిలో ఐదారు భారీ సినిమాలు ఉన్నాయి.

ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో వచ్చాడు.కానీ ఈ సినిమా ప్రభాస్ అభిమానులను బాగా నిరాశ పరిచింది.

ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కాదు.పాన్ వరల్డ్ సినిమాలను ప్రకటించి ఇండియన్ సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళాడు.

Advertisement

ప్రభాస్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో పాటు ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.

ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించ నున్నాడు.

అలాగే ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే కూడా షూటింగ్ దశలో ఉంది.ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.

ఇది పాన్ వరల్డ్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుండగా.

Royal Panda : Player Safety And Responsible Gambling — An ...
జుట్టు ఎంత పలుచగా ఉన్నా ఇలా చేస్తే నెల రోజుల్లో ఒత్తుగా మారుతుంది!

అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపు కుంటున్న ఇంత వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు.

Advertisement

అయితే ఈ క్రమంలో తాజాగా యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రాజెక్ట్ కే గ్లింప్స్ చూశానని చెప్పి డార్లింగ్ ఫ్యాన్స్ ను ఫుల్ ఎగ్జైట్ అయ్యేలా చేసాడు.దుల్కర్ నటించిన సీతా రామం ఈవెంట్ లో ఈయన ప్రాజెక్ట్ కే గ్లింప్స్ చూసే అదృష్టం నాకు కలిగింది.

ఈ సినిమా ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకు వెళుతుంది అని తెలిపాడు.ఈ కామెంట్స్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఆత్రుత మరింత ఎక్కువ అయ్యింది.