టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు..!

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు టీడీపీలో చేరనున్నారు.ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన రేపు కలవనున్నారు.

వైసీపీలో సరైన గుర్తింపు లేదని ఆరోపిస్తూ దాడి వీరభద్రరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తన అనుచరులతో పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో లేఖను రాసి సీఎం జగన్ కు పంపారు.ఈ క్రమంలోనే టీడీపీలోకి చేరుతున్నట్లు దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ తెలిపారు.2014 కు ముందు వరకు టీడీపీలోనే ఉన్న దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు.ఇన్నేళ్ల తరువాత మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు