కోవిడ్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి.అత్యధికులు ఉపాధిని కోల్పోయారు.
ఆకలి మరణాలు సంభవించాయి.చాలా మంది చిన్నారులు అనాధులుగా మారారు.
అయితే ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ఐటీ రంగం మాత్రం ఒక వెలుగు వెలిగింది.ఎన్నో కొత్త నియామకాలు చేపట్టింది.
ఉద్యోగులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందించింది.ఏ ఒక్క పని దినం కూడా వృధా కాకుండా కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేపట్టి ఉద్యోగులకు అదనపు సౌకర్యాలు అందిస్తూ ఐటీ రంగం అద్భుత ప్రగతి సాధించింది.
ఈ సమయంలో నిపుణులైన ఉద్యోగులుకు అద్భుత అవకాశాలు లభించాయి.ప్రాంగణ నియామకాలు ఎక్కువుగా జరిగాయి.
ఇంతటి ప్రగతి సాధించిన ఐటీ రంగం నేడు తీవ్ర సంక్షోభంతో అతలాకుతం అయ్యే పరిస్ధితులు పొంచి ఉన్నాయి.ఈ సంక్షోభం ఒక్క దేశానికి చెందిన సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా నేడు ఐటీ రంగంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
దీనికి గల కారణాలు పరిశీలిస్తే నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు అధిక ద్రవ్యోల్బణంతో అతలాకుతలం అవుతున్నాయి.ప్రధానంగా దీనిని అదుపు చేసే ఉద్దేశ్యంతో ద్రవ్య చలామణిని అరికట్టడానికి తొలుత అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచింది.
ఇదే బాటలో మిగిలిన దేశాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్న సంగతి మనకు విదితమే.మన దేశానికి చెందిన రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది.
దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆరంభం కావడం వెరసిఆర్ధిక మాంద్యం ముంచుకు వస్తుందనే భయాలు మరింత పెరిగాయి.అంతే కాదు ఆ సంకేతాలు రోజు రోజుకు ఉదృతమవుతూ వస్తున్నాయి.
కోవిడ్ విపత్తులో కూడా చెక్కు చెదరకుండా అభివృద్ధి బాటలో కొనసాగిన ఐటీ రంగంపై ఇది పెను ప్రభావం చూపనుంది.మున్ముందు ఈ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వీస్తున్న మాంద్యం గాలులు ఐటీ రంగాన్ని నేరుగా తాకాయి.మారుతున్న ఈ పరిస్ధితులలో మాంద్యం యొక్క తీవ్రత రానున్న 6 నెలల నుంచి సంవత్సరంలోపు ఐటీ రంగానికి ఎక్కువుగా ఉంటుందని ప్రపంచ దేశాల సీఈఓలు సైతం హెచ్చరిస్తున్నారు.
ఈ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకుని టెక్ కంపెనీలు ఇప్పటికే దిద్దు బాటు చర్యలు మొదలెట్టాయి.వ్వయ నియంత్రణ కై విభిన్న మార్గాలు అమలుపరుస్తూ కంపెనీల ఉనికిని కాపాడుకోవడానికి సతమతం అవుతున్నాయి.
దీనిలో భాగంగా చిన్న ఐటీ కంపెనీలే కాదు బడా కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించడంలో తమ వ్యూహాలను అమలుపరుస్తున్నాయి.కొత్తగా ప్రాంగణ నియమకాలు తగ్గి పోయాయి.
క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎన్నో వడపోతల మధ్య ఎంపిక చేసిన అభ్యర్థులకుఆఫర్ లెటర్ వచ్చినప్పటికి ఉద్యోగం లభిస్తుంది అనే నమ్మకం నేడు లేకుండా పోయింది.ఆఫర్ లెటర్ విషయమై అభ్యర్థులు వివరణ కోరుతూ ఉంటే సమాధానం ఇచ్చే వాళ్ళే కరువయ్యారు.
కొన్ని కంపెనీలు అయితే ఆఫర్ లెటర్ ఇచ్చిన వారికి మీకు వేరొక మంచి అవకాశం వస్తే ఉపయోగించుకోండి అంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నాయి.మరి కొన్ని కంపెనీ లు అయితే ఇచ్చిన ఆఫర్ లెటర్లు కూడా వెనక్కి తీసుకుంటున్నాయి.
హెచ్చు వేతనాలు తీసుకునే నిపుణుల వేతనాలలో సైతం కోతలు మొదలు పెట్టారు.ఉద్యోగులుకు ఇచ్చే వేతనాల పెంపు వాయిదా వేయడం లేదా తక్కువ పెంపుతో సరిపెట్టే చర్యలు ద్వారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి.
ప్రమోషన్ల సంగతి సరే సరి.ఉద్యోగుల భారాన్ని తొలగించుకోవడానికి కొన్ని కంపెనీలు అయితే మూన్ లైటింగ్ అనేది ఒక సాకుగా చూపించి ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
మరి కొన్ని అయితే ఉద్యోగి లో సరైన నైపుణ్య ప్రమాణాలు లేవు అంటూ తీసేస్తున్నాయి.ఐటీ బూమ్ ఉన్న సమయంలో ఈ లోపాలు కంపెనీలకు కనిపించలేదు.
ఇటువంటి సందర్భంలో నూతన నియామకాలు విషయం పక్కన పెడితే గతంలో ఉన్న ఉద్యోగులకే తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అన్న గ్యారంటీ లేకుండా పోయింది.ఈ సందర్భంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు మొదలయ్యాయి.
మరొక పక్క ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ప్రాంగణ నియామకం కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ నిస్పృహలు మొదలయ్యాయి.
ఇవన్నీ చూస్తే ఐటీ రంగంలో సంక్షోభం ఆరంభం అయ్యిందనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పటికే మాంద్యం ప్రభావం ఐటీపై స్పష్టంగా కనిపిస్తోంది.ఉద్యోగులను క్రమంగా తగ్గించుకోవడం, తొలగించడం, లే ఆఫ్స్ ఇవ్వడం, కొత్తగా నియామకాలు ఆపడం వంటివి చేస్తున్నాయి.
అమెరికాలో అయితే ఈ ముప్పు పేరిట విభిన్న టెక్ కంపెనీలు ఇప్పటికే దాదాపు 45 వేల మందిని తొలగించినట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో భారత్ ఐటీ రంగానికి రానున్నది గడ్డు కాలమే అని చెప్పవచ్చు.కొత్త ప్రాజెక్టులు వస్తాయి అనే నమ్మకం లేకుండా పోయింది.
అయితే భారత దేశం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంక్షోభాలను చూసింది చాలా వాటిని దీటుగా ఎదుర్కొంది.అలాగే ప్రస్తుతం అమెరికా, యూరప్లలో నెలకొన్న తాజా ఆర్థిక మాంద్యం మన దేశ ఆర్థిక వ్యవస్థపై మాత్రం ప్రభావం చూపబోదని కొందరు నిపుణులు చెబుతున్నారు,వీరి ధీమాకు కారణమేమంటే ప్రపంచ సాఫ్ట్వేర్ రంగంలో మన దేశం కీలక పాత్ర వహిస్తూ ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy