నేడు కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ భేటీ

నేడు సీడ‌బ్ల్యూసీ భేటీకానుంది.మ‌ధ్యాహ్నం మూడున్న‌ర గంట‌ల‌కు వ‌ర్చువ‌ల్ గా జ‌రిగే అవ‌కాశం ఉంది.

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల షెడ్యూల్‌కు ఆమోదం తెలిపేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే వైద్య ప‌రీక్ష‌ల కోసం సోనియా గాంధీ విదేశాల‌కు వెళ్ల‌డం, ఆమెకు తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంక‌లు కూడా వెళ్లిన నేప‌థ్యంలో వారు వ‌ర్చువ‌ల్ గా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీని సీనియ‌ర్ నేత‌లు వీడుతుండ‌టం, పార్టీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో.సోనియా, రాహుల్ నాయ‌క‌త్వంపై నేత‌లు విశ్వాసం ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంది.

మ‌రోవైపు క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు కాంగ్రెస్ నిర్వ‌హించ‌నున్న జోడో యాత్ర‌కు రాష్ట్రాల వారీగా స‌మ‌న్వ‌యక‌ర్త‌ల‌ను నియ‌మించింది.దీనిలో భాగంగా ఏపీకి డాలీశ‌ర్మ‌, తెలంగాణ‌కు ఎస్వీ ర‌మ‌ణ ఇంఛార్జ్ లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు