ఏపీలో ఎన్నికలకి కేవలం ఐదంటే ఐదు రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో గెలుపు ఎవరిదీ అనే విషయంలో తీవ్ర ఉత్ఖంట నెలకొంది.
ఎవరి అంచనాలు వారికి ఉంటాయి.
ఒకపక్క జాతీయ స్థాయి సర్వేలు, ఏపీలో హల్చల్ చేస్తున్నాయి, మరో పక్క ఇంటిలిజెన్స్ సర్వే ఇదే అంటూ ప్రతీ సర్వే రిపోర్ట్ సైతం వైసీపీ అధికారంలోకి రావడం పక్కా అంటున్నాయి.జనసేన పార్టీని సర్వేలు పట్టించుకోక పోవడం గమనార్హం.
ఇప్పటి వరకూ ఆ సర్వే ఈ సర్వే అంటూ ఎన్నెన్నో సర్వేలు వచ్చిన తరుణంలో తాజాగా ఇది సామాన్యుడి సర్వే అంటూ ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.అసలు ఏపీలో అధికారంలోకి రాబోయే పార్టీ ఇదే అంటూ ఓ సామాన్యుడి సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరి ఆ సామాన్యుడి సర్వే ఏంటో మనమూ ఒక సారి పరిశీలిద్దాం.
ఏపీలో ఓ వ్యక్తి చేసిన ఈ సర్వే రాజకీయ నేతలకి దిమ్మతిరిగేలా చేస్తోంది.అతడు ఒక్కడే ఏపీ వ్యాప్తంగా కొంతకాలంగా తిరుగుతూ ప్రజా నాడి పట్టుకోవడంలో సఫలం అయ్యాడని ఈ సర్వే రిపోర్ట్ చూసిన విశ్లేషకులు సైతం అంటున్నారు.ఇంతకీ అతడు సర్వే ఎలా చేశాడు, అతడి సర్వేలో అధికారంలోకి రాబోయే పార్టీ ఏమిటి.?? ఏపీ లో సీఎం పీఠాన్ని అధిష్టించే అర్హత ఎవరికి ఉందని తేలిందంటే.ఏపీలో అధికారాన్ని చేపట్టబోయేది వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని ఈ సర్వేలో తేలిందట.
డ్వాక్రా సంఘాలు , రైతులు, విద్యార్ధులు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు, మధ్య తరగతి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇలా ప్రతీ ఒక్కరి మనోగతాన్ని గగ్గరనుంచీ పరిశీలించి వారిని పలువిధాలుగా, వారిలో ఒక్కడిగా ప్రశ్నలు అడుగుతూ ఆ కుర్రాడు చేసిన సర్వే సంచలనం సృష్టిస్తోంది.అయితే అతడు ప్రధానంగా బ్యాంకుల వద్ద డ్వాక్రా సంఘాలు, రైతులని ఎక్కువగా కలిసి వారి మొనోగాతాన్ని తెలుసుకున్నాడని తెలుస్తోంది.అయితే
చంద్రబాబు ఇచ్చి పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ బాగానే వస్తున్నాయి కదా చంద్రబాబు నాయుడు ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు మరి రేపు ఓటు వేస్తారా అని అడిగిన ప్రశ్నకి గుక్క తిప్పుకోకుండా మొహమాటం లేకుండా మా ఓటు జగన్ కే అని సమాధానం వచ్చిందట.అదేంటి ఇన్ని డబ్బులు ఇస్తున్నాడుగా మరి ఓటు వేరే పార్టీకి వేస్తార అని అడుగగా ఇది ప్రజల డబ్బు మళ్ళీ ప్రజలకి ఇస్తున్నాడు అయినా మళ్ళీ ట్యాక్స్ లు కట్టేది మేమేగా కాకపొతే మాతో పాటు మీలా లబ్ది పొందని వారు కూడా ఈ డబ్బులకి ట్యాక్స్ లు కడుతారు అంతేగా అని సమాధానాలు ఇస్తున్నారట.
ఇదిలాఉంటే విద్యార్ధులు మొదలు, ఉద్యోగులు దాకా, మధ్య తరగతి కుటుంభాలు సైతం ఎవరు వచ్చినా మాకు వచ్చేవి వస్తాయి రానివి రావి కాని ఏపీలో మార్పు కావాలి.ఇన్నేళ్ళు చంద్రబాబు చేశారు ఈ సారి జగన్ కి అవకాశం ఇస్తే ఏమవుతుంది,ఒక్క సారి అవకాశం ఇచ్చి చూద్దాం అంటూ వారి అభిప్రాయాలని వ్యక్తపరిచారట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy