ఎంసీఆర్ హెచ్ఆర్డీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి..!

హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో ఆయన మాట్లాడారు.

అనంతరం సంస్థ కార్యలాపాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈక్రమంలోనే సోలార్ వాహనంలో తిరుగుతూ వివిధ బ్లాకులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.ఎంసీఆర్ హెచ్ఆర్డీని క్యాంపు కార్యాలయంగా మార్చాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఎంసీఆర్ హెచ్ఆర్డీని సందర్శించారని సమాచారం.

Advertisement
మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు