ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు రెండు రోజులపాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారని తెలుస్తోంది.

పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవనున్నారు.సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఇటీవల టీపీసీసీ సమావేశలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తీర్మాన వివరాలను సోనియాగాంధీకి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది.14న మణిపుర్ లో రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.అదే రోజు ఢిల్లీకి చేరుకొని దావోస్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఎమ్మెల్సీ అభ్యర్థులు, కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలను పార్టీ అధిష్టానం ముందు పెట్టనున్నారని సమాచారం.

రుద్రవీణ సినిమా కారణంగా నేను హోం శాఖ తీసుకోలేదు : పవన్ కళ్యాణ్
Advertisement

తాజా వార్తలు