సీఎం రమేష్ ఇంట్లో విషాదం

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకి అత్యంత కీలకమైన, నమ్మకస్తుడిగా పోరుపొంది ఇటీవల బీజేపీలో చేరిన కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుటుంబంలో విషాదం నెలకొంది.

సీఎం రమేష్ సోదరుడు ప్రకాష్ నాయుడు కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో మృతి చెందారు.

వీరి స్వస్థలం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కోట్ల దుర్తి.గత కొంత కాలం నుంచి ప్రకాష్ నాయుడు క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రకాష్ నాయుడు అనారోగ్యం శృతిమించడంతో సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు.ప్రకాష్ నాయుడు వయసు 51 సంవత్సరాలు.

ప్రకాష్ నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో చాలా కీలకంగా వ్యవహరించారు.దీంతో ఈ వార్త తెలిసిన వెంటనే జిల్లాకు చెందిన టిడిపి నాయకులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

తాజా వార్తలు