అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా జగనన్న విద్యా దీవెన అకౌంట్లలోకి నగదు విడుదల చేయనున్నారు.

11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.694 కోట్లు జమకానున్నాయి.ఈ క్రమంలోనే బటన్ నొక్కి నిధులు సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

అనంతరం మదనపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్లొంటారని అధికారులు తెలిపారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు