టిడిపి నేత బీద రవిచంద్ర సీఐ రాములు నాయక్ మధ్య వాగ్వాదం

నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని రామ్మూర్తి నగర్ ప్రైమరీ స్కూల్ లోని పోలింగ్ కేంద్రం వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సీఐ రాములు నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది.

ఇక్కడ ఎందుకు ఉన్నారని వెళ్లిపోవాలని సిఐ నాయక్ పేర్కొనడంతో వాగ్వాదం మొదలైంది.

తాము ఓటు వేసి కొన్ని టెక్నికల్ అంశాలకు సంబంధించి ఆగామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు.ఓటు వేసిన వారు వెంటనే వెళ్ళిపోవాలని నాయక్ పేర్కొనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023