తెలంగాణలో బీజేపీ - కాంగ్రెస్ మధ్య హోరాహోరీ..!!

లోక్ సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణలో ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడ్డాయి.

పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ( Congress , BJP ) మధ్య హోరాహోరీ పోరు నెలకొందని చెప్పుకోవచ్చు.

ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.ఇక ఏడు స్థానాల్లో బీజేపీ( BJP) లీడింగ్ లో ఉంది.

ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, జహీరాబాద్, పెద్దపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ లో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది.

అదేవిధంగా మెదక్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.హైదరాబాద్ లో ఎంఐఎం లీడ్ లో ఉంది.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు