క్షమాపణ చెప్పి చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలగాలి..: మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

టీడీపీ పాలనలో అనేక స్కాంలు జరిగాయన్న ఆయన చంద్రబాబు ప్రజా ధనాన్ని అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణంలోనూ భారీ అవినీతి జరిగిందని మంత్రి బొత్స తెలిపారు.అవినీతి ఎదురుగా కనిపిస్తున్న టీడీపీ నేతలు పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజలు అమాయకులని టీడీపీ భావిస్తోందన్నారు.ఈ క్రమంలో చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పి చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలగాలని సూచించారు.

వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు.చట్టానికి ఎవరూ అతీతులు కారన్న మంత్రి బొత్స ఎవరిపైనా తమ ప్రభుత్వానికి కక్ష లేదని తేల్చి చెప్పారు.

Advertisement

అదేవిధంగా శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.

కడపను టార్గెట్ చేసిన టీడీపీ .. అలెర్ట్ అవుతున్న జగన్
Advertisement

తాజా వార్తలు