గుంజీలు తీస్తే బస్సు టికెట్ ఫ్రీ.. ఎక్కడంటే

సాధారణంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా బస్సులో ప్రయాణం అనేది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.బస్సులో ప్రయాణించాలంటే టికెట్ కొనాలి.

లేదంటే పాస్ అయినా తీసుకోవాలి.అయితే ఒక చోట మాత్రం గుంజీలు తీస్తే చాలు ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు.

వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం.బస్సు టికెట్ ఫ్రీగా పొందాలనుకునేవారు 20 గుంజీలు తీస్తే చాలు.

ఈ బంపర్ ఆఫర్ ఎక్కడంటే.యూరప్‌ ఖండంలోని రొమానియా అనే దేశంలో! ఈ కంట్రీ గవర్నమెంట్ ప్రజలకు ఈ మంచి ఆఫర్‌ని అందిస్తోంది.

Advertisement

ప్రస్తుతం ఈ దేశంలో రొమానియా స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌ అనే హెల్త్ యాక్టివిటీ కొనసాగుతోంది.ఇందులో భాగంగా 20 గుంజీలు తీసేవారికి బస్ టికెట్ ఫ్రీగా ఇస్తామని కొత్త ఆఫర్‌ని ప్రభుత్వం ప్రకటించింది.20 గుంజీలు తీయడం ద్వారా ప్రజల ఆరోగ్యం కాస్తయినా మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంచ్ చేసింది.రొమేనియా ప్రజలు ఈ ఫ్రీ టిక్కెట్‌ను హెల్త్‌ టిక్కెట్‌గా పిలవడం విశేషం.

అయితే ఈ ఆఫర్ లో ఒక తిరకాసు ఉంది.అదేంటంటే ఫ్రీ టికెట్ పొందాలనుకునేవారు కేవలం 2 నిమిషాల్లో 20 గుంజీలు తీయాల్సి ఉంటుంది.

సో, సో టికెట్ పొందాలనుకునేవారు ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.

రొమేనియా యువతి గుంజీలు తీసి ఫ్రీగా టికెట్ పొందిన వీడియో ఒకటి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో.ఒక యువతి ఒక మెషిన్ బూత్‌ ముందు నిల్చోని 20 గంజీలు తీసింది.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
ఈ సంగతి తెలిస్తే, మీరు ఇక పానీపూరి బండివంక కన్నెత్తి కూడా చూడరు!

ఆ అయిపోగానే టిక్కెట్‌ మెషిన్ ఆ యువతి కరెక్ట్ గా గుంజలు తీసినదో లేదో చెక్ చేసిన తర్వాత ఒక టికెట్ బయటికి రిలీజ్ చేసింది.దాన్ని ఆమె తీసుకొని వెళ్ళిపోయింది.

Advertisement

ఈ టికెట్ మెషిన్ ఒక ఏటీఎం మిషన్ లాగానే కనిపించింది.ఈ ఆఫర్ చాలా బాగుందని, ఇండియాలో కూడా తీసుకొస్తే సూపర్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు