ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలనం సృష్టించే వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర సంపదనంతా ఏకీకృతం చేసి దోచుకుంటున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.

దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలనేది జగన్ లక్ష్యమని చెప్పారు.రాష్ట్రంలో జగన్ సర్కారే లిక్కర్ వ్యాపారం చేస్తోందని అన్నారు.

ఏపీలో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిందని చెప్పారు.జగన్ పాలనలో ప్రజలు బతకలేని పరిస్థితి ఉందని, ఆయన అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని అన్నారు.

ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్.ఇప్పుడు మోసం చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు.జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని అన్నారు.

షాలిని మణికట్టు కోసిన హీరో అజిత్.. చివరికి పెళ్లి పీటలు ఎక్కారు
Advertisement