అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారుకు శిక్ష పడాలి..: మంత్రి రోజా

టీడీపీ నేత బండారు సత్యనారాయణ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు.ఈ క్రమంలో బండారు సత్యనారాయణకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు మహిళలు అందరం కలిసి పోరాడుతామని మంత్రి రోజా తెలిపారు.చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికే తనను టార్గెట్ చేశారని ఆమె మండిపడ్డారు.

ఈ క్రమంలో బండారు సత్యనారాయణను వదిలేది లేదన్న మంత్రి రోజా న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.టీడీపీ -జనసేన దిగజారుడు వీడియోలు అందరికీ తెలుసన్నారు.

టీడీపీ -జనసేన చేసే పనులను ప్రజలు చూస్తున్నారని తెలిపారు.

Advertisement
గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం

తాజా వార్తలు