ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బాలయ్య రియాక్షన్

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు.ఏపీ రాష్ట్ర ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెప్పారు.

టీడీపీ విజయదుందుభి మొదలైందని తెలిపారు.మరోవైపు పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు వైసీపీ సిద్ధమైందని ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు లేకుండా, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని కోరారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement