దారుణం: 8 నెలల గర్భవతిని చిదిమేసిన తల్లిదండ్రులు?

అవును, మీరు విన్నది నిజమే.ప్రపంచం ఎటుపోతోందో తెలియడం లేదు.

ఉత్తర్​ ప్రదేశ్​లో ( Uttar Pradesh )జరిగిన ఓ దారుణ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

గర్భవతి అయిన యువతిని, ఆమె తల్లిదండ్రులు అత్యంత కిరాతకంగా చంపేశారు.

విషయం ఏమిటంటే, ప్రియుడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ఆమె నిరాకరించడమే ఆమె పాలిట శాపం అయింది.ఉత్తర్​ ప్రదేశ్​ మజాఫర్​నగర్​కు ( Mazzafarnagar )చెందిన ఓ 19ఏళ్ల యువతి ప్రేమలో పడింది.దానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరించడంతో తన ప్రియుడు రాహుల్​తో కలిసి.2022 అక్టోబర్​లో ఇల్లు విడిచి వెళ్లిపోయింది.ఈ క్రమంలో యువతి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ తరువాత గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.డిసెంబర్​లో ఈ ప్రేమ జంటను ట్రేస్​ చేసి పట్టుకున్నారు.తరువాత యువతిని, ఆమె కుటుంసభ్యులకు అప్పగించి.

Advertisement

కావాలనే యువకుడిపై కిడ్నాప్​, రేప్​ కేసులు వేసి జైలుకు తరలించారు.ఈ కేసుపై కొంతకాలంగా కోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ క్రమంలోనే యువతి గర్భం దాల్చిందని తేలింది.అయితే రాహుల్​కు శిక్షపడాలని యువతి తల్లిదండ్రులు బలంగా కోరుకోవడం చేత కూతురు తన ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని అనేకమార్లు ఒత్తిడి చేశారు.

కానీ ఆమె దానికి అంగీకరించలేదు.

దాంతో ఆమె తల్లిదండ్రులు( parents ) ఆమెని చంపేయాలని నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలో స్థానిక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన కీలక విచారణ జరగాల్సి ఉండగా యువతి, ఆమె తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లలేదు.అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా పోలీసులకు అసలు విషయం బయటపడింది.

మోకాలి నొప్పులు నివారించాలంటే.. ఇలా చెయ్యండి..!

రాహుల్​కు వ్యతిరేకంగా స్టేట్​మెంట్​ ఇవ్వనని కూతురు చెప్పడంతో తల్లిదండ్రులకు తీవ్ర కోపం వచ్చి సొంత బిడ్డను గొంతు నులిమి చంపేసినట్టు తెలుసుకున్నారు.అప్పటికి ఆమె 8 నెలల గర్భవతి.

Advertisement

చంపిన తరువాత యువతి మృతదేహాన్ని గోయ్​లా గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న నదిలో పడేశారు.పోలీసులకు విచారణలో భాగంగా జరిగిన తంతుని ఆమె తల్లిదండ్రులే ఒప్పుకున్నారు.

తాజా వార్తలు