ఎన్టీఆర్ మూవీ దెబ్బకు ఆ ఊరికి వెళ్లిపోవాలనుకున్నా.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో కంత్రి, శక్తి సినిమాలు తెరకెక్కాయి.కంత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా శక్తి సినిమా మాత్రం బాక్సాఫీస్ డిజాస్టర్ గా నిలిచింది.

45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో అశ్వనీదత్ కు ఏకంగా 25 కోట్ల రూపాయల రేంజ్ లో నష్టాలు వచ్చాయని సమాచారం.సీతారామం ప్రమోషన్స్ లో భాగంగా అశ్వనీదత్ శక్తి మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా శక్తి మూవీ ఘోరంగా దెబ్బ కొట్టిందని ఆయన చెప్పుకొచ్చారు.నా అల్లుడు నాగ్ అశ్విన్ లేకపోతే నేను ప్రేక్షకుల ముందు ఈ విధంగా కూర్చొని మాట్లాడగలిగే శక్తి నాకు ఉండేదని కాదని ఆయన కామెంట్లు చేశారు.

మెహర్ రమేష్ శక్తి సినిమాతో కొట్టిన దెబ్బ వల్ల నేను విజయవాడకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నేను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టానని ఆయన తెలిపారు.

Advertisement

రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల నేను ఆ సమయంలో కోలుకోగలిగానని ఆయన కామెంట్లు చేశారు.మెహర్ రమేష్ గురించి అశ్వనీదత్ చేసిన కామెంట్ల వల్ల మెగా ఫ్యాన్స్ టెన్షన్ పెడుతున్నారు.

తెలుగులో మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.బిల్లా మినహా మిగతా సినిమాల వల్ల నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చాయి.

భోళా శంకర్ సినిమాతో అయినా మెహర్ రమేష్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.వేదాళం సినిమాకు రీమేక్ గా భోళా శంకర్ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సిన బాధ్యత మెహర్ రమేష్ పై ఉంది.

ఈ సినిమా కూడా ఫ్లాపైతే మెహర్ రమేష్ సినిమా ఇండస్ట్రీకి దూరం కావడం ఖాయమని చెప్పవచ్చు.మెగా ఫ్యామిలీకి మెహర్ రమేష్ దూరపు బంధువు కావడం గమనార్హం.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు