వంగవీటి, కొడాలి నాని సహా మరో ఇద్దరిపై అరెస్ట్ వారెంట్..!

ఏపీలోని పలువురు వైసీపీ నేతలకు అరెస్ట్ వారెంట్ జారీ అయిందని తెలుస్తోంది.ఈ మేరకు నేతలు కొడాలి నాని, పార్థసారథి, అడపా శేషుతో పాటు టీడీపీ నేత వంగవీటి రాధాకు ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

2015 వ సంవత్సరంలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేసిన కేసులో హాజరుకాలేదని ప్రజా ప్రతినిధుల కోర్టు తెలిపింది.ప్రత్యేక హోదా కోసం ధర్నా చేసిన వీరు ఆ సమయంలో నమోదైన కేసులో ఇప్పటివరకూ న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోవడంపై సీరియస్ అయింది.

ఈ నేపథ్యంలోనే నేతలకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.అనంతరం ఆ నలుగురు నాయకులను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

The Foods That Help To Kill Breast Cancer Details
Advertisement

తాజా వార్తలు