Jagananna Vidyadevena Scheme : జగనన్న విద్యాదీవెన పథకంపై ఏపీ ప్రభుత్వం ఆదేశాలు..!!

ఏపీలో జగనన్న విద్యాదీవెన ( Jagananna Vidyadevena Scheme ) పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.నిన్న జగనన్న విద్యాదీవెన పథకం కింద రూ.

708.68 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు సుమారు 9.44 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది.అయితే ఈ డబ్బులను వారం, పది రోజుల్లో కాలేజీల్లో చెల్లించాలని విద్యార్థులు, వారి తల్లులకు ఏపీ ప్రభుత్వం సూచించింది.

పది రోజుల్లో కాలేజీల్లో నగదును చెల్లించకపోతే తదుపరి విడతలో నేరుగా కాలేజీలకే డబ్బులను జమ చేస్తామని సర్కార్ స్పష్టం చేసింది.

కాంతివంతమైన ముఖానికి సులువైన చిట్కాలు

తాజా వార్తలు