ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నేత గిడుగు రుద్దరాజు నియమితులయ్యారు.
కమ్యూనిస్టులు ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకెందుకు ? అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
ఏడ్చే మగాడిని, నవ్వే ఆడదానిని నమ్మకూడదని పెద్దలు చెబుతుంటారని అది టిడిపి అధినేత చంద్రబాబు విషయంలో రుజువు అయ్యిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
ఏపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన హర్ష కుమార్ ఆ పదవిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ల నియామకం మార్పు చేర్పులు చేపడుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
డిగ్రీ, పీజీ కాలేజీల్లో విద్యార్థులు ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది.
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత పై గతంలో ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చిన రైతులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ,14 మంది రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించింది.
ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ పిటిషన్ పై ఢిల్లీ హై కోర్ట్ విచారణ చేపట్టింది.
కాకినాడ జిల్లాలోని ఏటి మొగ లో రెండు బోట్ల అగ్నికి ఆహుతి అయ్యాయి.ఏటి మొగ కాలువ ద్వారా సముద్రానికి వెళ్లే దారిలో లంగరు వేసి ఉన్న రెండు బోట్లు ఒకసారిగా దగ్ధం అయ్యాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిజెపి నేత బిఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు స్వామి వారి దర్శనం కోసం 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి పోరెన్సీక్ నివేదిక సిట్ అధికారుల చేతికి చేరింది.
హైదరాబాద్ , ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైంది.
ఇంటర్ లో ప్రవేశానికి , ఉపకార వేతనానికి సంబంధించి వచ్చే నెల నాలుగో తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది.
టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బంగారు తెలంగాణ కాదని, బార్లు , బీర్లు తెలంగాణగా మారిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
వ్యవసాయ ధరణి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ ధర్నాల కార్యక్రమం కాంగ్రెస్ చేపట్టింది.
పోడు సమస్యలను ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంచడమే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి కారణం అవుతోందని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని సీతారాం అన్నారు.
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు.
.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy