News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు

  ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నేత గిడుగు రుద్దరాజు నియమితులయ్యారు.

 

2.బండి సంజయ్ కు సిపిఐ కౌంటర్

  కమ్యూనిస్టులు ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకెందుకు ? అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. 

3.చంద్రబాబుపై అంబటి రాంబాబు కామెంట్స్

 

ఏడ్చే మగాడిని, నవ్వే ఆడదానిని నమ్మకూడదని పెద్దలు చెబుతుంటారని అది టిడిపి అధినేత చంద్రబాబు విషయంలో రుజువు అయ్యిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 

4.పార్టీ పదవిని తిరస్కరించిన హర్ష కుమార్

  ఏపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన హర్ష కుమార్ ఆ పదవిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. 

5.వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ల నియామకంలో మార్పులు

 

వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ల నియామకం మార్పు చేర్పులు చేపడుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

6.డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఓటరు నమోదు

 

Advertisement

డిగ్రీ, పీజీ కాలేజీల్లో విద్యార్థులు ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. 

7.ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు భారీ జరిమానా

  ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత పై గతంలో ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చిన రైతులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ,14 మంది రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించింది. 

8.ఢిల్లీ మద్యం కేసు పై హైకోర్టు విచారణ

  ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ పిటిషన్ పై ఢిల్లీ హై కోర్ట్ విచారణ చేపట్టింది. 

9.కాకినాడ జిల్లాలో రెండు బోట్లు దగ్ధం

 

కాకినాడ జిల్లాలోని ఏటి మొగ లో రెండు బోట్ల అగ్నికి ఆహుతి అయ్యాయి.ఏటి మొగ కాలువ  ద్వారా సముద్రానికి వెళ్లే దారిలో లంగరు వేసి ఉన్న రెండు బోట్లు ఒకసారిగా దగ్ధం అయ్యాయి. 

10.బీఎల్ సంతోష్ పై కేసు నమోదు

  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిజెపి నేత బిఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. 

11.కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు

 

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. 

12.తిరుమల సమాచారం

 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు స్వామి వారి దర్శనం కోసం 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

13.సిట్ చేతికి ఫోరెన్సిక్ నివేదిక

 

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి పోరెన్సీక్ నివేదిక సిట్ అధికారుల చేతికి చేరింది. 

14.టీచర్ల ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

 

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

హైదరాబాద్ , ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైంది. 

15.ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రవేశ పరీక్ష

 

Advertisement

ఇంటర్ లో ప్రవేశానికి ,  ఉపకార వేతనానికి సంబంధించి వచ్చే నెల నాలుగో తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. 

16.బంగారు కాదు బార్లు , బీర్లు తెలంగాణ

 

టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బంగారు తెలంగాణ కాదని, బార్లు , బీర్లు తెలంగాణగా మారిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. 

17.నేడు కాంగ్రెస్ ధర్నాలు

  వ్యవసాయ ధరణి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ ధర్నాల కార్యక్రమం కాంగ్రెస్ చేపట్టింది. 

18.పోడు సమస్యలను పరిష్కరించాలి : తమ్మినేని

 పోడు సమస్యలను ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంచడమే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి కారణం అవుతోందని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని సీతారాం అన్నారు. 

19.నారా లోకేష్ తో జ్ఞానేశ్వర్ భేటీ

 

తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. 

20.ఈరోజు బంగారం ధరలు

 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,550

 

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,970

                     .

తాజా వార్తలు