న్యూస్ రౌండప్ టాప్ 20

1.వైసిపి ప్లీనరీ .

ట్రాఫిక్ మళ్లింపు

ఈనెల 8 9 తేదీల్లో వైసిపి రాష్ట్రస్థాయి ప్లీనరీ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా, భారీ వాహనాలతో పాటు , ఇతర వాహనాలను ప్లీనరీ లోకి రాకుండా ఇతర మార్గాల వైపు మళ్ళిస్తున్నట్లు ఏపీ డీజీపీ రాజేందర్ నాథ్ రెడ్డి తెలిపారు. 

2.సల్మాన్ న్యాయవాదికి బెదిరింపు లేఖ

 బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ న్యాయవాది హెచ్ సర్వసతాన్ ను చంపేస్తామంటూ కొందరు దుండగులు లేఖ రాశారు. 

3.భారత్ లో కరోనా

 

ఇక్కడికి 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18,930 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

4.కోడి పందాలతో నాకు సంబంధం లేదు : చింతమనేని

   హైదరాబాద్ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్న శిబిరంపై తెలంగాణ పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా కొంతమందిని పట్టుకోగా, ఎక్కువమంది పరారయ్యారు.

అయితే ఈ పందాలను నిర్వహిస్తోంది దెందులూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని నిర్ధారణ కావడంతో ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.  అయితే కోడి పందేలతో తనకు ఎటువంటి సంబంధం లేదని చింతమనేని ప్రకటించారు. 

5.బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష

 

Advertisement

ఈనెల 24న సికింద్రాబాద్ మహంకాళి, 24 న పాత బస్తీలో నిర్వహించే బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాన్ని తెలిపారు.ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

6.తెలంగాణలో మరో నాలుగు రోజులు పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

7.జగన్ ప్రధాని అవుతారు

 

ఏపీ సీఎం జగన్ కు ప్రధానమంత్రి అయ్యే అర్హత ఉందని, ఎప్పటికైనా ఆయన ప్రధానమంత్రి అవుతారు అని వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు అన్నారు. 

8.రాజ్యసభకు ఎంపికపై స్పందించిన విజయేంద్ర ప్రసాద్

  ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ కు విజయేంద్ర ప్రసాద్ ను ఎంపిక చేయడం పై ఆయన స్పందించారు.ఇది చాలా సహజమైన విషయం అంటూ మాట్లాడారు. 

9.బండి సంజయ్ తొండి సంజయ్

 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి విమర్శలు చేశారు.బండి సంజయ్ తొండి సంజయ్ అంటూ ఆయన వెటకారం చేశారు. 

10.శాతవాహన యూనివర్సిటీలో మళ్లీ ఎలుగుబంటి సంచారం

  శాతవాహన యూనివర్సిటీలో మళ్లీ ఎలుగుబంటి సంచారం మొదలయ్యింది.సాయంత్రం ఐదు గంటల తర్వాత హాస్టల్ బయటకు ఎవరూ రావద్దని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 

11.భద్రాద్రి హుండీ ఆదాయం లెక్కింపు

 

భద్రాద్రి శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ హుండీ ని అధికారులు లెక్కించారు.1.82 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

12.డిస్కం ల డీ లైసెన్సింగ్ పై వెనక్కి

  డిస్కం ల డీ లైసెన్సింగ్ పై కేంద్రం వెనక్కి తగ్గింది.విద్యుత్ సవరణ బిల్లు 2022 లో ఈ మేరకు మార్పులు చేపట్టినట్లు సమాచారం. 

13.ఆగస్టులో ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం ఉచితం

 

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఆగస్టులో ఆహార భద్రత కార్డులు కలిగిన ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం ఉచితంగా అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 

14.పోస్టల్ పార్సిల్ సర్వీసుల్లో ఆన్లైన్ చెల్లింపులు

  పోస్టల్ శాఖ హైదరాబాద్ రీజియన్ పరిధిలోని 5120 పోస్టాఫీసుల్లో ఆన్లైన్ చెల్లింపుల  ద్వారా పార్సెల్ సర్వీసులను వినియోగించుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తపాల శాఖ ,అధికారులు తెలిపారు. 

15.జేఈఈ మెయిన్స్ ఫైనల్ కీ విడుదల

 

Advertisement

జేఈఈ మెయిన్ సెషన్ ఫైనల్ కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 

16.65 కోర్టు మాస్టర్ పోస్టుల కు నోటిఫికేషన్ విడుదల

  65 కోర్టు మాస్టర్ పోస్టులకు తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

17.ఏటా కొత్త గురుకులాలు

 

బీసీల కోసం ఏటా కొత్త గురుకులాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 

18.డాక్టర్లకు మెడిసిన్ బుక్ లెట్లు

  రాష్ట్రంలో పనిచేస్తున్న డాక్టర్లు అందరికి మెడిసిన్ బుక్ లెట్లు ఇవ్వాలని  వైద్య శాఖ నిర్ణయించుకుంది. 

19.తెలంగాణ పోలీస్ కాదు టిఆర్ఎస్ పోలీస్

 

రాష్ట్రంలో ఉంది తెలంగాణ పోలీస్ కాదని, టిఆర్ఎస్ పోలీస్ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,850   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,110.

తాజా వార్తలు